News November 25, 2024

HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య

image

BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రబారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.

Similar News

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

image

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.

News November 8, 2025

జూబ్లీ బై పోల్: ఏజెంట్లకు గమనిక.. రేపు సాయంత్రం వరకే పాసులు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏజెంట్లుగా కూర్చునే వారికి ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేశారు. 11న ఎన్నికలు జరుగుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎంపికైన ఏజెంట్లు పాసులు 10వ తేదీ సాయంత్రం లోపు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు స్థానిక బూత్‌తో అధికారులను కలిసి పాసులు పొందాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. వీరంతా 11న ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలన్నారు.