News February 20, 2025
HYD: నోరూరిస్తున్న తిరొక్క రకాల మామిడి పండ్లు

వేసవి వేళ HYD నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తీరొక్క రకాల మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. HYD శివారులోని బాటసింగారం మార్కెట్లో కొనుగోలు జోరందుకోగా కొత్తపేట, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో అనార్కలీ, జాఫ్రాన్, ఫరేబి, కోకోనట్లైన్, తోతాపూరి, లంగడా సేఫేది లాంటి రకాల మామిడి పండ్లను వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి అంటేనే మామిడి పండ్లు కాగా..రకాన్ని బట్టి రూ.80 నుంచి రూ.120కిలో అమ్ముతున్నారు.
Similar News
News December 8, 2025
జిల్లాలో 100% ఓటింగే లక్ష్యం: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% ఓటింగ్ ఎలక్షన్ గా ప్రతి ఒకరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని, ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులను చూపి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికలలో 90.14 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఉన్నారు.
News December 8, 2025
ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News December 8, 2025
మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.


