News December 15, 2024

HYD: పటేల్ చిత్రపటానికి బీజేపీ కార్యాలయంలో నివాళులు

image

‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ప్రముఖ నాయకులతో కలిసి పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర ఎంతోమంది రాజకీయ నాయకులకు మార్గదర్శమని అన్నారు.

Similar News

News November 22, 2025

HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

image

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News November 22, 2025

రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

image

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYD‌కు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT

News November 22, 2025

రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

image

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYD‌కు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT