News December 15, 2024
HYD: పటేల్ చిత్రపటానికి బీజేపీ కార్యాలయంలో నివాళులు
‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ప్రముఖ నాయకులతో కలిసి పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర ఎంతోమంది రాజకీయ నాయకులకు మార్గదర్శమని అన్నారు.
Similar News
News January 22, 2025
HYD: మాజీ ఎమ్మెల్యేపై కేసు.. KTR రియాక్షన్
దాడిచేసింది గాక తిరిగి మాజీ ఎమ్మెల్యేపైనే కేసు పెట్టారు, ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన రసాభాసలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదన్నారు.
News January 22, 2025
VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో
సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.
News January 22, 2025
HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000
జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT