News February 24, 2025
HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.
Similar News
News October 16, 2025
మంత్రుల వ్యవహారంపై ఇన్ఛార్జి నటరాజన్ సీరియస్

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్ ఎందుకు చేశారనే దానిపై ఇన్ఛార్జి ఆరా తీశారు.
News October 16, 2025
జూబ్లీ సాక్షిగా సర్కారుపై పోరుకు సిద్ధం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 22 నెలల 9 రోజులైంది. ఈ లోపే పలువురు సర్కారుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని బాధితులు బహిరంగంగా ప్రకటించారు. RRR, లగచర్ల భూసేకరణ, ఫార్మాసిటీ బాధితులు, గ్రూప్-1 అభ్యర్థులు, మాలసంఘాల నాయకులు నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. వీరందరి పోరు ఎవరికి నష్టమో తెలియాలి.
News October 16, 2025
HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?