News April 15, 2024
HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం
బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన మేయర్
దసరా పండుగ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని, చెడుపై మంచి గెలుపు, అధర్మంపై ధర్మం విజయాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, ఐక్యత, శాంతి, సత్ప్రవర్తనను ప్రోత్సహించాలని కోరారు. నగర ప్రజలకు సంక్షేమం, సుఖసంతోషాలు సర్వదా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట
GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.
News October 12, 2024
HYD: రేపు ఉప్పల్లో మ్యాచ్.. బజరంగ్ దళ్ నిరసన
రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-బంగ్లా మ్యాచ్లో జెండాలతో బజరంగ్ దళ్ శాంతియుత నిరసన తెలియజేస్తుందని దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టినట్లు ఆయన వివరించారు. అంతేకానీ.. మ్యాచ్ను అడ్డుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.