News January 22, 2025

HYD: పద్మరావుతో ఫోన్‌లో మాట్లాడిన KTR

image

డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆయన ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు పద్మారావు కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం.

Similar News

News November 25, 2025

BREAKING: హబ్సిగూడలో విషాదం.. 10TH క్లాస్ స్టూడెంట్ సూసైడ్

image

హబ్సిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి విద్యార్థిని(15) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపనికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకొన్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 25, 2025

సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

News November 25, 2025

GHMC కౌన్సిల్ హాల్‌లో తగ్గేదే లే!

image

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.