News March 27, 2025
HYD: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూర్

తెలంగాణ పర్యాటకశాఖ ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. HYD నుంచి పలు కొత్త పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని ఊటీ, అరకు తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చుట్టేసేలా వీటిని రూపొందిస్తున్నారు. పర్యాటకుల డిమాండ్ ఆధారంగా ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 15, 2025
అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్

AP: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉత్తరాంధ్రలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తిరుపతి శ్రీసిటీలో డైకెన్, బ్లూస్టార్, LG సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.
News October 15, 2025
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
News October 15, 2025
ఈశాన్య రుతుపవనాలు.. దేశంలోకి రేపే ఎంట్రీ!

ఈశాన్య రుతుపవనాలు గురువారం(oct-16) దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. తర్వాత 1,2 రోజులకు APలో విస్తరించే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల వల్ల ఈ నెల నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.