News March 27, 2025
HYD: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూర్

తెలంగాణ పర్యాటకశాఖ ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. HYD నుంచి పలు కొత్త పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని ఊటీ, అరకు తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చుట్టేసేలా వీటిని రూపొందిస్తున్నారు. పర్యాటకుల డిమాండ్ ఆధారంగా ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
స్వధార్ హోమ్లో మహిళ ఆత్మహత్య: SI

విజయనగరంలోని BC కాలనీ మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ హోమ్లో భారతి (21) ఆత్మహత్య చేసుకుందని రూరల్ SI అశోక్ కుమార్ తెలిపారు. SI వివరాలు ప్రకారం.. అబూజా (17)ని భారతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొత్తవలసలోని ఓ చోరి కేసులో ఈ నెల 12న అబూజాని అరెస్ట్ చేసి బాల నేరస్థుల హోంకు తరలించారు. ప్రేమ వివాహం కారణంగా వీరిని కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడంతో ఆమెను స్వధార్ హోమ్లో ఉంచారు. అక్కడ ఆమె అత్మహత్య చేసుకుంది.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<