News April 2, 2025
HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు వచ్చేశాయి. ముషీరాబాద్, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్మెట్ ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
Similar News
News January 1, 2026
భారీ జీతంతో ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(EIL)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 2 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే నెలకు AGMకు రూ.1లక్ష-రూ.2,60,000, Sr.మేనేజర్కు రూ.90,000-రూ.2,40,000, మేనేజర్కు రూ.80,000-రూ.2,20,000, dy.మేనేజర్కు రూ.70,000-రూ.2,000000 చెల్లిస్తారు.
News January 1, 2026
మారింది డేటే.. ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే

క్యాలెండర్లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST
News January 1, 2026
సంగారెడ్డి: ‘ఈ నెల 5లోగా పరీక్ష ఫీజు చెల్లించండి’

సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 5లోగా పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 5 చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం తమ పరిధిలోని అధ్యయన కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.


