News April 19, 2024
HYD: పిడుగుపాటుతో రైతు మృతి

పిడుగుపాటుతో ఓ రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగయ్య శుక్రవారం సాయంత్రం తన పొలంలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో జంగయ్య పై పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Similar News
News January 25, 2026
HYD: వారిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష..!

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణ వ్యక్తి దివ్యాంగుడిని లేదా దివ్యాంగురాల్ని వివాహమాడితే రూ.లక్ష ప్రోత్సాకాన్ని అందిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా శిశు, మహిళా సంక్షేమ అధికారి తెలిపారు. వరుడు లేదా వధువు 40% దివ్యాంగత సర్టిఫికెట్ కలిగి ఉండి పెళ్లైన ఏడాదిలోపు మ్యారేజ్ సర్టిఫికెట్తో అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News January 23, 2026
ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్లపై స్మార్ట్వాచ్లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.
News January 20, 2026
RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్స్కు అప్లై చేసుకోండి

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.


