News February 2, 2025
HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు.
Similar News
News October 31, 2025
HYD: అజ్జూ భాయ్ చుట్టూ పొలిటికల్ డ్రామా

ఇపుడు చర్చ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై కాకుండా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ చుట్టూ సాగుతోంది. కారణం ఆయనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తుండటం వల్లే. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి మంత్రి పదవి ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు, ఆయన దేశానికి చేసిన సేవను బీజేపీ గుర్తించడం లేదని కాంగ్రెస్ నేతలు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు.
News October 31, 2025
మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్కు ఫిర్యాదు చేశారు. సునితపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 31, 2025
HYD: ‘రన్ ఫర్ యూనిటీ’లో సీపీ, చిరంజీవి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, ఔత్సహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


