News February 2, 2025

HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

image

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు

Similar News

News November 27, 2025

ములుగు కలెక్టరేట్‌లో కొత్త విత్తన ముసాయిదాపై చర్చ

image

రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి కొత్త విత్తన బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు సేకరించామని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. ఈరోజు ములుగులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విత్తనబిల్లు-2025లోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం, 1966లోని లోపాలు, కొత్త విత్తన చట్టం లక్ష్యాలు వంటి ప్రతి అంశంపై చర్చించామన్నారు.

News November 27, 2025

విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

News November 27, 2025

ఖమ్మం: సర్పంచ్ అభ్యర్థి.. కోటి రూపాయల మ్యానిఫెస్టో

image

నేలకొండపల్లి(M) ముఠాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు గ్రామాభివృద్ధిపై భారీ మ్యానిఫెస్టోను ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైతే, కోటి రూపాయల వరకు సొంత ఖర్చుతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాభివృద్ధి అవసరాల కోసం ఎకరం భూమిని విరాళంగా ఇస్తానని ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనతో గ్రామంలో ఎన్నికలు హీటెక్కాయి.