News February 2, 2025

HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

image

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు

Similar News

News February 2, 2025

SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

image

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

News February 2, 2025

ట్రంప్‌తో ప్రధాని మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ నేత భార్గవ్

image

దేశంలో విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రగతి లేక సంపన్నులు దేశం వదిలిపోతున్నారని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు వల్లూరు భార్గవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి అమెరికాలో ఉన్న భారతీయులకు అక్కడ సౌకర్యాలు కల్పించాలని తేదా ఇక్కడ అభివృద్ధిని గురించి అర్థమయ్యేలా చెప్పి వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

News February 2, 2025

అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్

image

ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్‌లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.