News March 3, 2025
HYD: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా..? జాగ్రత్త..!

సెల్ ఫోన్లలో నిరంతరం ఆటలు, వీడియోల్లో మునిగితేలుతూ, ల్యాప్ ట్యాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చూసే పిల్లలకు వర్ణాంధత్వం వస్తున్నట్లుగా HYD-HCU ఆచార్యులు డాక్టర్ శివరాం నోట్ విడుదల చేసారు. దీన్ని గుర్తించడం కోసం ‘రిశివి’ సాఫ్ట్ వేర్ అనే యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. వర్ణాంధత్వం వచ్చినవారు కొన్ని రంగులను గుర్తించలేరు.
Similar News
News November 23, 2025
గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీనివాసరావు

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News November 23, 2025
సిరిసిల్ల: విధేయతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం

1982లో యూత్ కాంగ్రెస్లో చేరిన సంగీతం శ్రీనివాస్ 44ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఈయన ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, OBC రాష్ట్ర కమిటీ, PCC సభ్యుడిగా పని చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటి ఛైర్మన్గా సేవలందించారు. 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, రాజన్న సిరిసిల్ల DCC అధ్యక్షుడు అయ్యారు.
News November 23, 2025
MBNR: సైబర్ మోసాలు.. నిందితులు వీరే..!

సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు.1.జర్పుల సురేందర్,2.కాట్రావత్ హనుమంతు,3.వడ్త్యా రాజు,4.వత్య భాస్కర్,5.కాట్రావత్ నరేష్,6.రాత్లావత్ సంతోష్,7.రాత్లావత్ సోమల వీరంతా తువ్వగడ్డ తండా, జై నల్లిపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. MBNR, WNP టీమ్ల సహకారంతో లొకేషన్ ట్రాక్ చేసి అరెస్టు చేశారు. విచారణ అనంతరం జుడిషియల్ రిమాండ్కు పంపారు.


