News March 3, 2025
HYD: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా..? జాగ్రత్త..!

సెల్ ఫోన్లలో నిరంతరం ఆటలు, వీడియోల్లో మునిగితేలుతూ, ల్యాప్ ట్యాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చూసే పిల్లలకు వర్ణాంధత్వం వస్తున్నట్లుగా HYD-HCU ఆచార్యులు డాక్టర్ శివరాం నోట్ విడుదల చేసారు. దీన్ని గుర్తించడం కోసం ‘రిశివి’ సాఫ్ట్ వేర్ అనే యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. వర్ణాంధత్వం వచ్చినవారు కొన్ని రంగులను గుర్తించలేరు.
Similar News
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
News November 15, 2025
కామారెడ్డి: రాజీమార్గమే రాజమార్గం

రాజి మార్గమే రాజమార్గమని కామారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. దీని ద్వారా కేసులను పరిష్కారించుకోవాలని ఆయన సూచించారు.


