News February 15, 2025

HYD: పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం

image

గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ప్రభాకర్‌ను విచారణ నిమిత్తం 3 రోజులు కస్టడీకి తీసుకోగా.. శుక్రవారం ముగిసింది. ఆయనను CCS, గచ్చిబౌలి పోలీసులు వివిధ కోణాల్లో విచారించి వివరాలను సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80కి పైగా కేసుల్లో నిందితుడైన ఇతడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉంది.

Similar News

News October 25, 2025

SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

image

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 25, 2025

WGL: ఐఐఎస్సీ ప్రొఫెసర్ మాధవిలత ఎవరో తెలుసా..?

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ డా.జి. మాధవీలతా వరంగల్‌ ఎన్ఐటీ సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆమె, జియోటెక్నికల్ ఇంజినీరింగ్‌లో నిపుణురాలు, చీనాబ్ వంతెనకు భూగర్భ సాంకేతిక సలహాదారుగా 17 ఏళ్లపాటు సేవలు అందించి దేశ గౌరవాన్ని పెంచారు. ఆమె నిట్‌లో విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News October 25, 2025

కర్నూలు ఘోర ప్రమాదంలో ‘కడప జిల్లా వాసి ముృత్యుంజయుడు’

image

కర్నూలు ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పెద్దముడియంలోని నెమళ్లదిన్నెకు చెందిన జయసూర్య మృత్యుంజయుడయ్యాడు. 25 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బీటెక్‌ పూర్తి చేసిన జయసూర్య బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి దూకి ప్రాణాలుకాపాడుకున్నాడు. కాగా రెండు కాళ్లు విరిగినట్లు తెలిపాడు.