News March 11, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News November 22, 2025
వరంగల్: ‘సారథి’ సాగట్లే..!

సారథి పరివాహన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు పెరుగుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, స్థాయి పెంపుదల, బ్యాడ్జ్ లైసెన్స్ అప్లికేషన్లకు డేటా కనిపించకపోవడం, రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు వరుసగా వస్తున్నాయి. రెండు నెలలుగా వెబ్సైట్ నూతనీకరణ తర్వాత పరిస్థితి ఇంకా చక్కదిద్దకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు
News November 22, 2025
JGTL: రోడ్లపై ధాన్యం రాశులు వద్దు.. ఇలా చేస్తే ముద్దు..!

రోడ్లపై రైతులు పోస్తున్న ధాన్యంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న దాన్ని గుర్తించిన JGTL VDC సభ్యులు ఇటీవల తమ ఆధ్వర్యంలో దుబ్బగట్టు ప్రాంతాన్ని చదును చేశారు. మల్లాపూర్(M) కేంద్రంలో రైతులు ధాన్యం పోసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. JCBలతో ఫ్లాట్ చేయించారు. వీరికి పార్టీల నేతల సహకారం అందింది. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై పోయొద్దని ఈ సందర్భంగా వారు కోరారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇలానే చేయాలని ఆకాంక్షించారు.
News November 22, 2025
TU: పీజీ ఇంటిగ్రేటెడ్ రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోండి..!

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్( అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్) 2,4 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు తమ ఫలితాలపై రివాల్యుయేషన్ చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ తెలిపారు. ఈ మేరకు నిన్న సర్కులర్ జారీ చేశారు. ఈనెల 29లోపు రూ.500 రుసుము చెల్లించి పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.


