News March 11, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News January 15, 2026

ఆకర్షణగా ‘I ❤️ MULUGU’

image

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘I ❤️ MULUGU’ సైన్‌బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సైన్‌బోర్డు పట్టణ అందాన్ని మరింత పెంచింది. స్థానికులు, సందర్శకులు ఇక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ములుగు పట్టణానికి గుర్తింపుగా ఇది మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News January 15, 2026

మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 15, 2026

NGKL: పండుగ రోజు విషాదం.. బావిలో శవాలై తేలారు.!

image

పండుగ వేళ కొల్లాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన వరలక్ష్మి(18), లావణ్య(12) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన లావణ్య మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో చుక్కాయపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.