News March 15, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

image

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు  

image

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

News March 15, 2025

సన్మార్గంలో జీవించకపోతే కఠిన చర్యలు: SP

image

విజయనగరం జిల్లాలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడకుంటే కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీట్ కలిగిన వ్యక్తుల ప్రవర్తన, కదలికలను నిత్యం గమనించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్యాడ్ క్యారెక్టర్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. బీసీ షీట్లు కలిగిన వ్యక్తుల లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.

error: Content is protected !!