News April 14, 2025
HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

రెయిన్బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News November 15, 2025
Where is my Train యాప్ సృష్టికర్త ఇతడే!

ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్లలోనే గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం. కానీ ‘Where is my Train’ యాప్ వచ్చాక లైవ్ స్టేటస్ను తెలుసుకోగలుగుతున్నాం. ‘సిగ్మాయిడ్ ల్యాబ్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ను 2018లో గూగుల్ కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మొహైదీన్ తన టీమ్తో కలిసి ఈ యాప్ను అభివృద్ధి చేశారు. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ ₹320 కోట్లు దాటింది. మీరూ ఈ యాప్ వాడతారా?
News November 15, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల రెజోఫెస్ట్ 2025 ముగిసింది. నిన్న ముఖ్యఅతిథిగా 48th ఛీప్ జస్టిస్ NV రమణ హాజరై 16 రెజోనెన్స్ కొత్త స్కూల్స్ ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి, యాక్టర్లు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధన గురించి వివరించారు. నిన్న 35 క్యాంపస్ల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
News November 15, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల రెజోఫెస్ట్ 2025 ముగిసింది. నిన్న ముఖ్యఅతిథిగా 48th ఛీప్ జస్టిస్ NV రమణ హాజరై 16 రెజోనెన్స్ కొత్త స్కూల్స్ ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి, యాక్టర్లు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధన గురించి వివరించారు. నిన్న 35 క్యాంపస్ల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.


