News April 14, 2025

HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

image

రెయిన్‌బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News March 8, 2026

చిత్తూరులో భానుడి ప్రతాపం

image

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News March 8, 2026

తూ.గో: కారులో ఫొటోలు.. SMలో వైరల్

image

ఓ యువతివి అసభ్యకర దృశ్యాలను చిత్రీకరించి SMలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణనగర్‌లో ఉండే దర్శకుడు శంకర్(25) కాకినాడ నుంచి వచ్చిన యువతి(23)కి వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పించాడు. కారులో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 8, 2026

నిర్మల్: ఆ కుటుంబంలో ‘ఆమె’ కీలకం

image

నిర్మల్ జిల్లా పెద్ద బెల్లాల్‌కి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు TGPSC ద్వారా ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. జాడి విజయలక్ష్మి ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈగా, ఆమె వదిన చంద్రకళ వీఆర్వోగా, మరో వదిన జ్యోతి గ్రూప్-2 ద్వారా ఎంపీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం జ్యోతి సోన్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.
HAPPY WOMENS DAY