News April 14, 2025

HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

image

రెయిన్‌బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News February 12, 2026

మల్కాజిగిరి కార్పొరేషన్: తూర్పు కోటలో రియల్ ఎస్టేట్ జాతర!

image

తూర్పు సిటీకి ఇప్పుడు ‘అదృష్టం’ పట్టింది. ​తార్నాక హుడా కాంప్లెక్స్ కేంద్రంగా మల్కాజిగిరి కార్పొరేషన్ తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు దుబాయ్ రేంజ్ స్కై స్క్రాపర్లు కట్టేందుకు గవర్నమెంట్ రూట్ మ్యాప్ రెడీ చేసింది ప్రభుత్వం. ఆఫీసియల్ సమాచారం ప్రకారం, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు సెట్ చేసి పశ్చిమ నగరానికే సవాల్ విసరబోతున్నారు.

News February 12, 2026

ఓహో.. ‘బేగంపేట’కు ఆ పేరు ఇలా వచ్చిందా?

image

బేగంపేటకు ఉన్న చారిత్రక నేపథ్యం నిజాం కాలానికి చెందింది. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంకు ఉమ్రన్ అమిర్‌తో వివాహం చేశారు. ఆ సందర్భంగా కట్నంగా ఒక విలువైన స్థలాన్ని ఆమెకు దానం చేశారు. ఆ భూమి బషీర్ ఉన్నిసా బేగం పేరిట నమోదు కావడంతోనే కాలక్రమేణా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజవంశ వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

News February 12, 2026

HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

image

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.