News May 6, 2024
HYD: పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ: మాధవీలత
ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. HYD కార్వాన్లో ఏర్పాటు చేసిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ తమిళిసైతో కలిసి మాధవీలత పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీజేపీకి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 2, 2024
BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 2, 2024
HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!
దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.
News October 2, 2024
HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!
HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT