News April 5, 2024
HYD పోలీసుల అదుపులో నల్గొండ కానిస్టేబుల్స్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని వారిపై అభియోగం. అప్పట్లో మాజీ ఓ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు సహకరించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 24, 2025
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన DSP
ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టులో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ DSP కె. శివరాంరెడ్డి నార్కట్పల్లి సీఐ నాగరాజుతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. దేవాలయ EO నవీన్ కుమార్ నార్కెట్ పల్లి పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2025
నల్లగొండ: పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం
జనవరి 30 నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగనున్న LLB మూడు, ఐదు సంవత్సరాల మొదటి సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని NSUI అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో COEకి వినతిపత్రం అందజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యమైన కారణంగా పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్కి తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
News January 23, 2025
NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు
సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.