News October 21, 2024
HYD: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: CP

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. అంబర్పేట సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 24, 2025
HYD: షాకింగ్.. 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ సూసైడ్

అబ్దుల్లాపూర్మెట్(మం) కోహెడలో మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. వీళ్లు 6th-10th కలిసి చదువుకున్నారు. గ్యార వైష్ణవి(18) మంగళవారం ఉరేసుకుంది. ఆమె క్లాస్మెట్ సతాలీ రాకేశ(21) ఇంటి సమీపంలో ఓ షెటర్లో బుధవారం ఉరేసుకున్నాడు. అదే ఊరిలోని బుద్ధ శ్రీజ(18) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.
News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. కూకట్పల్లి సూర్య సేఫ్

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కూకట్పల్లి మూసాపేట్ Y జంక్షన్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన సూర్య (24) సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ ఎల్ 16 బుక్ చేసుకుని బెంగళూరుకు బయల్దేరగా కర్నూలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు మృతి చెందారు. సూర్య మాత్రం సేఫ్గా బయటపడ్డారు. సూర్య ఫొటో Way2Newsకు అందింది.


