News May 2, 2024

HYD: పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త సుమా!

image

HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.

Similar News

News September 13, 2025

HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

image

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.

News September 13, 2025

సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

image

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

News September 13, 2025

‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

image

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.