News January 30, 2025

HYD: ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న: సామ

image

‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్‌రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.

Similar News

News November 5, 2025

ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

image

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.

News November 5, 2025

బ్యాంకులకు ధీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తాం: గన్ని వీరాంజనేయులు

image

ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహా జనసభను డీసీసీబీ సీఈఓ సింహాచలం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాన్ని నష్టాల బాట పట్టించారని తీవ్రంగా విమర్శించారు. 2 నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

News November 5, 2025

మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

image

జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.