News March 25, 2024

HYD: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్ 

image

డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.

Similar News

News April 13, 2026

నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

ఆరెంజ్ ఆర్మీ అంటే SRH ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతిభ కనబరిచే క్రికెటర్లను అభిమానించే మనసులవి. ‘మేము SRH అభిమానులమే కానీ.. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ విధ్వంసం చూసేందుకైనా నేడు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలి’ అని SMలో పోస్టులు చేస్తున్నారు. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న 2 జట్ల మెరుపులతో సా.7:30 తర్వాత నగరం దద్దరిల్లనుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News April 13, 2026

HYD: భర్త డ్యూటీకి.. భార్య వీడియో కాల్స్

image

ఆడియో, వీడియో కాల్ యాప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. HYD సహా ఇతర ప్రాంతాల్లో చదువుకునే వారి నుంచి మహిళల వరకు యువకులకు వల వేస్తూ డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరుస్తున్నారు. మరికొందరేమో భర్త డ్యూటీకి వెళ్లాక అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ అంటూ ఇలాంటి యాప్స్‌నకు ఆకర్షితులవుతున్నట్లు Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు భర్తలు సైతం వీటిలోకి టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.

News April 13, 2026

ఖైరతాబాద్ మైనారిటీ గురుకులానికి 2 స్టేట్ ర్యాంకులు

image

ఇంటర్ ఫలితాల్లో ఖైరతాబాద్ మైనారిటీ గురుకుల(TMREIS) విద్యార్థులు రెండు స్టేట్ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన MD ఫర్హాన్ CEC సెకండ్ ఇయర్‌లో 988 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధిస్తే, ఇదే కళాశాలకు చెందిన హర్ష HEC ఫస్ట్ ఇయర్‌లో 492 మార్కులతో స్టేట్ 2nd ర్యాంక్ సాధించాడు. ఈ ఫలితాలు మైనారిటీ గురుకులాల పనితీరుకు నిదర్శనమని కళాశాల ప్రిన్సిపల్ హబీబ్ హర్షం వ్యక్తంచేశారు.