News March 19, 2024
HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 13, 2025
HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

డిఫెన్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్పై నేరేడ్మెట్ పోలీసులు దాడులు చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్లతో పురుషులకు క్రాస్ మసాజ్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News November 13, 2025
జూబ్లీహిల్స్ ఓటింగ్ వివరాలు

☛మొత్తం ఓటర్లు: 4,01,365
Male: 2,08,561
Female: 1,92,779
Others: 25
☛పోలైన ఓట్లు: 1,94,631
Male: 99,771
Female: 94,855
Others: 5
Polling Percentage: 48.49%
News November 13, 2025
HYD: వలపు వల.. మగవాళ్లు జాగ్రత్త!

HYDలో వలపు వల విసిరి అమాయకుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందంతో కట్టి పడేయడం, అడ్డదారిలో లాగేయడం ఓ దందాగా మారింది. వాట్సాప్, టెలిగ్రామ్లో చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. గంజాయి సరఫరా, ఉద్యోగం ఇప్పిస్తాం, కన్సల్టెన్సీ అని చెబుతూ డబ్బులు అకౌంట్లో పడ్డాక సైడ్ అవుతున్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
SHARE IT


