News March 19, 2024

HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

image

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News December 3, 2025

HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

image

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్‌పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.

News December 3, 2025

HYD: విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం..!

image

GHMCలో శివారు ప్రాంతాల విలీనానికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ విలీనంతో నేతలు, రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ స్థాయి నేతల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఎందుకీ విలీనం, భూములే లేనిచోట అభివృద్ధిపై వివరణ ఎక్కడని ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లేలేని తమని ట్యాక్స్ కట్టడంలో బంజారాహిల్స్‌తో పోటీ పడమంటారా అని మేడ్చల్, RR ప్రజలు భగ్గుమంటున్నారు.

News December 3, 2025

HYD: విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం..!

image

GHMCలో శివారు ప్రాంతాల విలీనానికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ విలీనంతో నేతలు, రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ స్థాయి నేతల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఎందుకీ విలీనం, భూములే లేనిచోట అభివృద్ధిపై వివరణ ఎక్కడని ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లేలేని తమని ట్యాక్స్ కట్టడంలో బంజారాహిల్స్‌తో పోటీ పడమంటారా అని మేడ్చల్, RR ప్రజలు భగ్గుమంటున్నారు.