News July 22, 2024
HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.
Similar News
News November 24, 2025
రేపు GHMC పాలకమండలి సమావేశం!

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
News November 24, 2025
చర్లపల్లి టెర్మినల్కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
News November 24, 2025
HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.


