News June 28, 2024
HYD: ప్రజావాణి కార్యక్రమానికి 494 దరఖాస్తులు

HYD బేగంపేట్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 24, 2025
డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్పై అధికారులు చర్చిస్తున్నారు.
News November 24, 2025
అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగర్హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.
News November 24, 2025
HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

శామీర్పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్లోని ORR వైపు మళ్లించాడని, శామీర్పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.


