News February 25, 2025
HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.
News November 6, 2025
పిరం కానున్న కొండగట్టు అంజన్న దర్శనం

జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచారు. దీంతో భక్తులకు అంజన్న దర్శనం ‘పిరం’గా మారనుంది. కాగా, అభివృద్ధి అంటే భక్తులకు కనీస వసతులు కల్పించడమా.. లేక ఛార్జీలు పెంచడమా.. అని భక్తులు మండిపడుతున్నారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు ఓ పక్క కనీస అవసరాలు లేక అల్లాడిపోతుంటే.. పెంచిన ఈ ఛార్జీలు మరింత భారం కానున్నాయి.
News November 6, 2025
నిజామాబాద్: ఇజ్రాయెల్లో JOBS.. రేపు ఇంటర్వ్యూలు

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.


