News March 27, 2025

HYD: ప్రతి మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్..!

image

రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాస్థాయిలో త్వరలో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అవగాహన లేక 60-70% మంది ఆలస్యంగా వైద్యం తీసుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. దీనిని అరికట్టేందుకు HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఆరోగ్య మహిళ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Similar News

News December 9, 2025

ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

image

భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో 8మండలాల్లో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295మంది సిబ్బంది నియమించామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎస్ఈసీ రాణి కుముదినికి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

సిద్దిపేట: ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. గజ్వేల్, మర్కుక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌలతాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News December 9, 2025

HYD: గ్రేట్.. 9 మందికి ప్రాణం పోశారు!

image

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్‌ డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను సేకరించి 9 మందికి ప్రాణం పోశారు. తమ బాధను పక్కన పెట్టి చూపిన వీరి త్యాగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.