News March 27, 2025

HYD: ప్రతి మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్..!

image

రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాస్థాయిలో త్వరలో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అవగాహన లేక 60-70% మంది ఆలస్యంగా వైద్యం తీసుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. దీనిని అరికట్టేందుకు HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఆరోగ్య మహిళ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Similar News

News November 22, 2025

అద్దం పగిలితే అపశకునమా?

image

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్‌ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.

News November 22, 2025

మంగేళ గ్రామంలో ఎస్సీలకు దక్కని రాజ్యాంగ ఫలం

image

ఎస్సీ జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎస్సీ కులస్థులకు మాత్రం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. బీర్పూర్ (M) మంగేళ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 238గా ఉంది. ప్రస్తుతం సుమారు 350 వరకు ఉంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీ కులస్థులు వెనుకబడి పోతున్నారు. ఇప్పుడైనా ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నారు.

News November 22, 2025

అచ్చంపేట: ASI మహేశ్ మృతి

image

అచ్చంపేట పట్టణంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న మహేశ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అతడి మృతితో పోలీస్ డిపార్ట్మెంట్‌లో విషాదఛాయాలు అలుముకున్నాయి. పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.