News May 3, 2024

HYD: ప్రధాని మోదీవి అన్ని అబద్ధాలే: కేటీఆర్ 

image

అబద్ధాలు చెప్పే ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ప్రతి ఒక్కరి జన్​ ధన్​ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రజలను వంచించారని BRS వర్కింగ్​ ప్రెసిడెంట్​ KTR విమర్శించారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్​ MP అభ్యర్థి పద్మారావుగౌడ్​‌కు మద్దతుగా బన్సీలాల్​‌పేట్ జబ్బర్​ కాంప్లెక్స్​ వద్ద నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే తలసాని, పద్మారావుతో కలిసి పాల్గొన్నారు.

Similar News

News November 2, 2025

HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

image

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 2, 2025

BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.

News November 2, 2025

HYD: TRPలో చేరికలు

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.