News April 11, 2025
HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.
Similar News
News December 6, 2025
గుంటూరులో ప్రకాశం జిల్లా వాసి అరెస్ట్

మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి FBలో దుష్ప్రచారం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఫొటోలను గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
News December 6, 2025
తిరుపతి: యువతిపై వేధింపులు నిజమేనా..?

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో <<18490909>>యువతి వేధింపులపై<<>> YCP పోస్ట్ వైరల్ అయ్యింది. మరీ అది నిజమేనా.. కాదా అని తేల్చాసిన బాధ్యత అటు పోలీసులపై.. ఇటు యూనివర్సిటీ అధికారులపై ఉంది. దీనికి సంబంధించి వర్సిటీ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పష్టత ఎప్పటికి వచ్చే అవకాశం ఉందోమరి.
News December 6, 2025
MNCL: డేటా నమోదులో తప్పులు ఉండకూడదు: డీఈఓ

మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో శనివారం యూడైస్ (UDISE) వర్క్షాప్ జరిగింది. డీఈఓ యాదయ్య మాట్లాడుతూ.. ఎంఈఓలు హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించి, పాఠశాలల్లోని మౌలిక వసతులు సహా అన్ని వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేయాలని సూచించారు. యూడైస్ డేటాకు కేటాయించిన 580 మార్కుల ఆధారంగానే జిల్లాకు ర్యాంకు, సౌకర్యాల మంజూరు ఆధారపడి ఉంటుందని ప్లానింగ్ కోఆర్డినేటర్ భరత్ తెలిపారు.


