News April 11, 2025
HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.
Similar News
News November 28, 2025
వరంగల్: పార్టీ జెండా, కండువాలే అస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులుండవు. గ్రామపోరులో ఏ గుర్తు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. పోటీచేసే అభ్యర్థి తాను ఏ పార్టీకి చెందినవాడో తెలియజేసేది చేతిలో పార్టీ జెండా, కండువాలే. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు, చీరల, రేషన్ కార్డుల పంపిణీలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకొని గ్రామాల్లో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలే తమకు ప్రచార అస్త్రాలని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.
News November 28, 2025
ADB: ఏకగ్రీవాలు చెల్లవు..!

సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతోంది. అయితే ఇవి చెల్లుబాటు కావని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఉపసంహరణ, నామినేషన్ల తిరస్కరణకు గురైన తర్వాత ఒకరే అభ్యర్థి బరిలో ఉంటే దానిని ఏకగ్రీవంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10, నిర్మల్ జిల్లాలో 7 వరకు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జరిగినట్లు సమాచారం.
News November 28, 2025
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.


