News October 30, 2024

HYD: ప్రాణాంతకంగా మారుతున్న గాలి కాలుష్యం!

image

హైదరాబాద్‌లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దాదాపు 5.6% మరణాలు కాలుష్యం వల్లే జరుగుతున్నట్లు ల్యాన్ సెట్ నివేదికలో వెల్లడైంది. 2008 నుంచి 2019 మధ్య 11 ఏళ్ల కాలంలో సంభవించిన 36 లక్షల మరణాలను ల్యాన్ సెట్ నివేదిక అధ్యయనంలో విశ్లేషించింది. ఏడాదిలో వాయు కాలుష్యం వల్ల 1597 మరణాలు సంభవించాయని పేర్కొంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సరిగా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది.

News November 8, 2025

HYD: ముఖ్యమంత్రి ప్రజావాణిలో 285 దరఖాస్తులు

image

బేగంపేటలోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో మొత్తం 285 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 154, రెవెన్యూకు 25, హోం శాఖకు 17, ఇందిరమ్మ ఇళ్ల కోసం 59, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తు, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ వెల్లడించారు.

News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.