News October 29, 2024
HYD: ప్రాణాలు పోతున్నాయ్.. జాగ్రత్త!

దీపావళి ముంగిట HYDలో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. బొగ్గులకుంట ఘటన మరవక ముందే యాకుత్పురాలో ఘోరం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు. అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేయడం, నిబంధనలు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ పాటించాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలిచ్చారు. నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేయడం సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.


