News March 22, 2025

HYD: ప్రియుడి సూచన.. NTR స్టేడియంలో దారుణం

image

NTR స్టేడియంలో పసిపాపను కాల్చివేసిన ఘటనలో మైనర్ బాలుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన మైనర్ బాలిక, నల్గొండ జిల్లాకు చెందిన బాలుడు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటి అవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండక ముందే డెలివరీ కావటంతో పుట్టుకతోనే పాప చనిపోయింది. ప్రియుడి సూచన మేరకు NTR స్టేడియంలో మృతశిశువును బాలిక కాల్చివేసింది. పోలీసులు బాలుడిని జువైనల్‌కి తరలించారు.

Similar News

News March 29, 2025

రంగారెడ్డిలో అత్యధికం ఉష్టోగ్రత ఇక్కడే..!

image

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. యాచారం, మంగల్‌పల్లిలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. చందనవెల్లి 41.3, రెడ్డిపల్లె, చుక్కాపూర్ 41.2, ప్రొద్దుటూరు 41.1, నల్లవెల్లి, కేశంపేట 41, మీర్‌ఖాన్‌పేట, కొత్తూర్ 40.9, మామిడిపల్లె, పెదఅంబర్‌పేట్, తొమ్మిదిరేకుల 40.8, మొగల్గిద్ద, కాసులాబాద్ 40.7, కేతిరెడ్డిపల్లి 40.6, మొయినాబాద్ 40.5, తట్టిఅన్నారం, షాబాద్ 40.4, కోంగరకలాన్లో 40.3℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 29, 2025

కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

image

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.

News March 29, 2025

ఉగాదికి కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం సిద్ధం 

image

ఉగాది పండగ సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సర్వం సిద్ధం ఐనట్లు ఆలయ EO లావణ్య తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక లైన్, ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండగ పురస్కరించుకొని ఆదివారం సా 6లకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున భక్తులు పంచాంగ శ్రవణ ఫలితాన్ని విని తరించాలని కోరారు.

error: Content is protected !!