News April 4, 2025
HYD ప్రెస్క్లబ్ 2025 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్ ప్రెస్క్లబ్ 2025 డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఆవిష్కరించారు. ప్రెస్క్లబ్కు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని ప్రెస్క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రెస్క్లబ్ పాలకమండలి సభ్యులు బట్టిని శాలువాతో సత్కరించారు.
Similar News
News October 18, 2025
జూబ్లీహిల్స్ కోసం 40 ‘హస్త్రాలు’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ 40 అస్త్రాలు ప్రయోగిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. AICC స్టేట్ ఇన్ఛార్జీ, CM, డిప్యూటీ CM, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో కూడిన 40 మందిని ప్రచారం కోసం నియమించడం విశేషం. ఒక్క MLA స్థానం కోసం కాంగ్రెస్ ఉద్దండులు అంతా బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
News October 18, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: స్టార్ క్యాంపెయినర్లుగా మీనాక్షి, రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్లో పాల్గొననున్నారు. నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేస్తారు. ఇక ఈ మూడు వారాలు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలతో సందడిగా మారనుంది.
News October 18, 2025
రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియం దున్నరాజుల ప్రదర్శనకు వేదికైంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి తరలిరానున్నారు. సదర్ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో పండుగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారీ ఆకారంలో ఉన్న దున్నపోతులు రేపు విన్యాసాలు చేయనున్నాయి. కాగా, ఈ నెల 22న నారాయణగూడలో పెద్ద సదర్ జరగనుంది.