News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

Similar News

News November 11, 2025

జూబ్లీబైపోల్: 9:30 గంటలకు Voter Turnout

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ తెలిపారు. పలుచోట్ల EVM యంత్రాలు మొరాయిస్తుండగా చర్యలు చేపట్టి, పునరుద్ధరించారు. ఫస్ట్ ఓటర్ టర్న్ అవుట్ ఉదయం 9:30 గంటలకు అందుబాటులో ఉంటుందని ECVT టీం తెలిపింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఓటు వేశారు? పర్సంటేజ్ ఎంత? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

News November 11, 2025

HYD: ఓటు వేసి ఈ పని చేయండి

image

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్‌ బూత్‌కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్‌ పెట్టి మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్‌ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

image

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్‌ డేట్‌. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్‌ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.