News February 23, 2025
HYD: ఫిబ్రవరిలోనే.. కరెంట్ డిమాండ్

గ్రేటర్ పరిధిలో సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ఠ డిమాండ్ 3435 మెగావాట్లు. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే 3456 మెగావాట్లుగా నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అని అధికారులు అంచనాలు వేశారు. దీనికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
Similar News
News November 22, 2025
రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ హర్మన్ సిద్ధూ(37) మృతి చెందారు. మాన్సా-పాటియాలా రోడ్డులో వెళ్తుండగా ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో హర్మన్ అక్కడికిక్కడే మరణించారు. బేబే బాపు, బబ్బర్ షేర్, కోయ్ చక్కర్ నై, ముల్తాన్ వర్సెస్ రష్యా తదితర సాంగ్స్తో ఆయన పాపులర్ అయ్యారు. హర్మన్ మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
News November 22, 2025
పెద్దపల్లి: మద్యాహ్న భోజన కార్మికుల సమ్మెకు విస్తృత మద్దతు

PDPL జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల 8 రోజుల సమ్మెకు KVPS, CITU, SFI, DYFI సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని నాయకులు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రూ.3,000 గౌరవ వేతనం తక్కువైందని, వాగ్దానం చేసిన రూ.10,000 వేతనం, నిత్యవసర వస్తువులు, వంటగ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
News November 22, 2025
జగిత్యాల అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతలు

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరిన అనంతరం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పోలీసు వ్యవస్థలో చైతన్యం నెలకొనున్నదని అధికారులు పేర్కొన్నారు.


