News November 27, 2024

HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే

image

వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

జూబ్లీహిల్స్‌‌లో దొంగ ఓట్ల ఆరోపణలపై ఎన్నికల అధికారి ప్రకటన

image

కొన్ని మీడియాలు, సోషల్ మీడియా వేదికల్లో జూబ్లీహిల్స్‌లోని కొన్ని ఇళ్లల్లో కావాలనే దొంగ, కొత్త ఓటర్లు చేర్చారన్న వార్తలను ఎన్నికల అధికారులు ఖండించారు. విచారణలో ఆ చిరునామాల్లోని ఓటర్లు ఇప్పటికే 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల తుది జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. కొత్తగా ఎవరూ నమోదు కాలేదని, కొన్ని ఇళ్లు భవనాలు కావడం వల్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.

News October 14, 2025

FLASH: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తనిఖీల్లో రూ.25 లక్షలు పట్టివేత

image

HYD జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) అమీర్‌పేట్ మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారధి స్టూడియో సమీపంలో ఓ కారును తనిఖీ చేసింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. జైరాం తలాసియా అనే వ్యక్తి కారులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును అధికారులు సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం మధురానగర్ PS SHO ప్రభాకర్‌కు అప్పగించారు.

News October 14, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

image

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.