News February 6, 2025
HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT
Similar News
News November 17, 2025
దారులన్నీ భీమన్న గుడివైపే.. భక్తులతో వేములవాడ కిటకిట

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి పోటెత్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవాలని వేములవాడకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనాలు నిలిపివేయడంతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అభిషేక పూజల్లో పాల్గొని కోడెమొక్కులు సమర్పించుకుంటున్నారు. భీమేశ్వరాలయం వైపు భక్తుల సందడి పెరగగా, జాతర గ్రౌండ్ ప్రాంతంలో చాలావరకు తగ్గిపోయింది.
News November 17, 2025
గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.


