News February 6, 2025

HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ

image

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.

Similar News

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

సమస్య పరిష్కారంలో జాప్యం ఉండకూడదు: మహబూబాబాద్ కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతోపాటు IDOCలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.