News February 26, 2026
HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీవర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం.
Similar News
News April 18, 2026
రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్..!

రంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా కందుకూరు పరిధి రాచలూరు, ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, గండిపేట, మొయినాబాద్, యాచారం ఏరియాల్లో ఇటీవల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ 42కుపైగా నమోదు కావడం గమనార్హం.
News April 18, 2026
బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం ఎందుకు?: NDSA ఛైర్మన్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనుల్లో జరుగుతున్న జాప్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉన్న కొన్ని ఒప్పందపరమైన సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA ఛైర్మన్కు వివరించారు.
News April 18, 2026
KNR: రెచ్చిపోతున్న కల్తీనూనె మాఫియా

ఉమ్మడి KNR(D)లో కల్తీనూనె దందా విస్తృతంగా సాగుతోంది. తక్కువధర సోయాబీన్ నూనెను రసాయనాలతో వాసన మార్చి పల్లి, పొద్దుతిరుగుడు నూనెలుగా విక్రయిస్తున్నారు. 40కిలోల సోయాలో కేవలం 2కిలోల పల్లినూనె కలిపి పూర్తిగా పల్లినూనెగా అమ్ముతున్నారు. KNR, KRTL,JGTL,SRCL,PDPLలోని గోడౌన్లలో టన్నుల నిల్వలతో పలు బ్రాండ్ల పేర్లపై కోట్ల వ్యాపారం జరుగుతోంది. కల్తీ నూనె నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది.


