News February 13, 2025

HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్‌శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్‌ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT

Similar News

News September 16, 2025

ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

image

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

News September 16, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

image

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.