News February 13, 2025
HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT
Similar News
News October 20, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో ఎత్తుగడ వేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకవేళ సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉంటాడు.
News October 20, 2025
సంగారెడ్డి: దీపావళి.. 101కు కాల్ చేయండి: కలెక్టర్

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు.
News October 19, 2025
WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.