News February 13, 2025
HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT
Similar News
News December 15, 2025
HYD: నిజాం నీడలో నలిగిన తెలంగాణ: చిల్లర దేవుళ్లు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ గ్రామీణం ఎదుర్కొన్న అణచివేతలను దాశరథి రంగాచార్యులు <<18569096>>చిల్లర దేవుళ్లు<<>>లో హృదయవిదారకంగా చిత్రించారు. దొరలు, కర్ణం వ్యవస్థ, భూస్వాములు, వెట్టిచాకిరీ, మతమార్పిడులు, స్త్రీల వేదనల జీవితం కళ్లముందు కదులుతున్నట్లే ఇందులో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నాటి దుర్భర సామాజిక పరిస్థితులను చరిత్రగా అక్షరీకరించారు. ఈ నవల చదువుతున్నంత సేపు నాటి సమాజంలో ఉన్నట్లే ఉంటుంది.
News December 15, 2025
HYD: నిజాం నీడలో నలిగిన తెలంగాణ: చిల్లర దేవుళ్లు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ గ్రామీణం ఎదుర్కొన్న అణచివేతలను దాశరథి రంగాచార్యులు <<18569096>>చిల్లర దేవుళ్లులో<<>> హృదయవిదారకంగా చిత్రించారు. దొరలు, కర్ణం వ్యవస్థ, భూస్వాములు, వెట్టిచాకిరీ, మతమార్పిడులు, స్త్రీల వేదనల జీవితం కళ్లముందు కదులుతున్నట్లే ఇందులో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నాటి దుర్భర సామాజిక పరిస్థితులను చరిత్రగా అక్షరీకరించారు. ఈ నవల చదువుతున్నంత సేపు నాటి సమాజంలో ఉన్నట్లే ఉంటుంది.
News December 15, 2025
ఏలూరు: చెరువులో పడి YCP నేత మృతి

కామవరపుకోట(M) గుంటుపల్లిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొమ్మిన నరేశ్ మృతి చెందారు. చెరువులో చేపలకు మేత వేసే క్రమంలో పంటి తిరగబడి మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


