News January 28, 2025
HYD: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: గద్దర్ గళం

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ధ నౌక, దివంగత నేత గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గద్దర్ గళం అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య తెలిపారు. మంగళవారం HYD బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
భూపాలపల్లి జిల్లాలో శనివారం ముచ్చట్లు

✓ భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్
✓ భూపాలపల్లి: టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
✓ మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన తోటి కార్మికులు
✓ భూపాలపల్లి ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు ఒకటే బెడ్
✓ కాళేశ్వరం లో భక్తుల సందడి
✓ చిన్న కాళేశ్వరం పనులపై కలెక్టర్ సమీక్ష
✓ వే 2న్యూస్ కథనానికి స్పందించి గుంతలు పూడ్చిన అధికారులు
News November 23, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్

> జనగామ డీసీసీ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి నియామకం
> డబ్బులు వస్తువులు ఆరోపణ బచ్చన్నపేట ఎంపీడీవో బదిలీ
> పాలకుర్తిలో యూరియా కోసం రైతుల పడిగాపులు
> చాకలి ఐలమ్మ మార్కెట్లో రైతుల ఇక్కట్లు
> లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సీఐటీయూ నేతల డిమాండ్
> రేపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కరారు: కలెక్టర్
> స్వయం ఉపాధికి ముద్ర యోజన కీలకం: శివకృష్ణ
News November 23, 2025
ఈనెల 24న జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పర్యటన

ఈనెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పీ.విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఈ నెల 24న హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఏఐసీసీ సెక్రటరీ పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


