News November 11, 2024

HYD: బండి సంజయ్ దళిత వ్యతిరేకి: డా. లింగస్వామి

image

తెలంగాణ ఉన్నత విద్యా కమిషన్ రద్దు చేయాలని, ఛైర్మన్‌గా నియమించబడ్డ ఆకునూరి మురళిని తొలగించాలనడం బండి సంజయ్‌కి దళితుల మీదున్న వ్యతిరేకతకు నిదర్శనమని అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా. మంచాల లింగస్వామి ఆరోపించారు. బండి సంజయ్, BJP దళితులకు వ్యతిరేకమని, దళిత ఐఏఎస్ అధికారిని తొలగించాలన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి అనర్హుడని, ఆయనను బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News January 6, 2026

HYD: తెలుగు చదవలేకపోతున్నారు..!

image

10వ తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు చదవడం, రాయడం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ HYD వ్యాప్తంగా స్టడీ ఆన్ మదర్ టంగ్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 వేల శాంపిల్స్ పరిశీలించిన బృందం 74.6% మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడంలేదని తెలిపింది. సర్వేలో 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఇందులో మెజార్టీ విద్యార్థులు మాటలకే పరిమితం అవుతున్నట్లు గుర్తించారు.

News January 6, 2026

హైదరాబాద్ నగరానికి యువీ!

image

టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నొవాటెల్‌లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తన అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టులో పోటీ పడ్డారు.

News January 6, 2026

బల్దియా.. 3 ముక్కలు అవుతోందయా!

image

పరిపాలనా సౌలభ్యం కోసం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఉన్న బల్దియాను 6 జోన్ల HYD, 3 జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల బదిలీలు, JCల నియామకాలు జరుగుతున్నాయి. పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశముంది.