News February 5, 2025

HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.

Similar News

News February 12, 2026

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం.. కేంద్రానికి CM విజ్ఞప్తి

image

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ వ్య‌యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణ‌వ్‌‌తో పార్ల‌మెంట్‌లోని ఛాంబ‌ర్‌లో భేటీ అయి దీనిపై చర్చించారు.

News February 12, 2026

‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

image

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.

News February 12, 2026

సంక్షోభంలో సింగరేణి.. కొత్త CMD గట్టెక్కించేనా?

image

సింగరేణి నూతన సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లు, నిధుల మళ్లింపు ఆరోపణలతో రేగిన రాజకీయ దుమారం, కేంద్ర విచారణల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించేలా భారీ కసరత్తు చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంలో కొత్త బాస్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.