News July 17, 2024

HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత

image

విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటన‌తో జవహర్‌నగర్‌ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్‌ సెంటర్‌కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి‌ చేసి చిన్నారిని చంపినట్లు‌ స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.

Similar News

News November 10, 2025

జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

image

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: పోలింగ్‌ కోసం 3 వేల మంది ఉద్యోగులు

image

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.

News November 10, 2025

HYD: మన కోసం మరో గంట పెంపు

image

జూబ్లీహిల్స్‌లో ఓటు వేసే వారికి EC శుభవార్త చెప్పింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగేది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 47.49% శాతం మందే ఓటేశారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కోసం మరో గంట సమయం ఇచ్చారు. వెళ్లి ఓటేయండి.
SHARE IT