News July 17, 2024
HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత

విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటనతో జవహర్నగర్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్ సెంటర్కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి చేసి చిన్నారిని చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.
Similar News
News November 9, 2025
జూబ్లీ బైపోల్లో ఓటుకు రూ.2,500- రూ.5వేలు!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా.5 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో చివరి రోజు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు, ఓటుకు రూ.2500- రూ.5వేల వరకు పంపిణీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం కట్టడి చర్యలు చేపట్టింది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నేటి సా.6 గం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి.
News November 9, 2025
జూబ్లీహిల్స్లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
News November 9, 2025
జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.


