News February 2, 2025

HYD: బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్యే: హరీశ్

image

ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవని రేవంత్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ ముఖం చాటేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని చెప్పారు. 

Similar News

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.

News November 8, 2025

వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

image

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.

News November 8, 2025

కొలిమిగుండ్ల: వైరల్ ఫీవర్‌తో చిన్నారి మృతి

image

కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లిలో వైరల్ ఫీవర్ సోకి విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె పద్మిని(9) నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్, కామెర్లతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎంఈఓ అబ్దుల్ కలాం సంతాపం వ్యక్తం చేశారు.