News August 16, 2024
HYD: బీఆర్ఎస్లో చేరిన NSUI నాయకులు

రంగారెడ్డి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు అభిశేఖ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం రాజేంద్రనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పలువురు NSUI నాయకులు అభిశేఖ్ ఆధ్వర్యంలో కారెక్కారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో యువనాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ‘ఇక మార్పు మొదలైంది.. వలసలు పెరుగుతాయి’ అంటూ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్లో BRS ఓటమికి కారణాలివే?

జూబ్లీహిల్స్లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్మెంట్లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ గెలుపు.. కలిసొచ్చినవి ఇవే!

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్
News November 14, 2025
HYD: BRSను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నారా అని ఇటీవల KTR అన్నారని, కచ్చితంగా భావిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంపై ఆయన మాట్లాడారు. ప్రజాపాలన వైపు ప్రజలు ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమన్నారు. BRSను ప్రజలు నమ్మడం లేదని, అది ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, తాము బీసీ బిడ్డకు టికెట్ కేటాయించామన్నారు.


